Home ఆంధ్రప్రదేశ్ చోరీలకు పాల్పడుతున్న యువకున్ని పట్టుకున్న గ్రామస్తులు

చోరీలకు పాల్పడుతున్న యువకున్ని పట్టుకున్న గ్రామస్తులు

303
0

చిల్లకూరు పోలీసులు రంగప్రవేశం
అనుమానితుడు ని స్టేషన్ కి తరలింపు
నెల్లూరు
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పారిచెర్లవారిపాలెం లో చోరీలకు పాల్పడుతున్నాడన్న  అనుమానంతో ఓ యువకుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేసిన ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి ఓ ఇంట్లో చొరబడి చోరీకి ప్రయత్నించగా ఆ ఇంటి యజమాని ఆ యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ ఇంటి యజమాని గాయాలయ్యాయి.  ఎట్టకేలకు  అనుమానాస్పదంగా ఉన్న యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.  ఇటీవల కాలంలో గ్రామంలో వరుస చోరీలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  ఆ గ్రామానికి చెందిన ఓ దుకాణం లో ఇటీవల చోరీ జరిగి సెల్ ఫోను నగదు కూడా  చోరీకి గురైంది.  యువకుడికి దేహశుద్ధి చేసిన విషయం పోలీసులకు సమాచారం అందడంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువకుడు మరో ముగ్గురు యువకుల పేర్లు కూడా చోరీలకు  పాల్పడే వారి జాబితాలో పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

Previous articleపొలాల్లోకి దూసుకెళ్లిన సూపర్ లగ్జరి బస్సు
Next articleమెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన సుప్రీమ్ హీరో సాయితేజ్‌, దేవ క‌ట్టా ‘రిప‌బ్లిక్‌’ ట్రైల‌ర్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here