సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ – హైదరాబాద్ మరియు సాలార్ జంగ్ మ్యూజియం – మినిస్ట్రీ అఫ్ కల్చర్ , భారత ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో 2021 సంవత్సరానికి ఫోటోగ్రఫీలో ప్రతిభ కనపరిచిన వారికి ఇచ్చే అవార్డులకు కోరుట్లకు చెందిన చలిగంటి వినోద్ కుమార్ ఎంపిక అయ్యాడు.శుక్రవారం సాలార్ జంగ్ మ్యూజియంలో అంతర్జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ ఏ .నాగేందర్ రెడ్డి హజరైఫోటో గ్రాఫర్ వినోద్ కు అవార్డును ప్రధానం చేశారు ..వినోద్ పంపిన తెలంగాణ కల్చర్ కు సంబంధించిన ఫోటోల ప్యానల్ ను ఎంపిక చేశారు.ఈ కార్యాక్రమంలో సిగ్మా అకాడమీ చెర్మన్ ఎం.సి.శేఖర్ , డైరెక్టర్ కే.జనార్దన్ , మ్యూజియం అసిస్టెంట్ డైరెక్టర్ వీరేందర్, జె ఎన్ టియూ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.భారత దేశం నుండి 38 మంది ప్రతిభ మూర్తులను ఎంపిక చేశామని అకాడమీ చైర్మన్ తెలిపారు.