యాదాద్రి,సెప్టెంబర్ 24
భావి తరాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలను అందించాలని రాష్ట్ర టియూ డబ్ల్యు జె కార్యదర్శి గుండు ముత్తయ్య,వడాయి గూడెం సర్పంచ్ మనీష్ గౌడ్ లు పేర్కొన్నారు.శుక్రవారం
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే దుర్గామాత ఉత్సవ కమిటి నూతన కార్యవర్గాన్ని సర్పంచ్ గుండు మనీష్ గౌడ్, ఉప సర్పంచ్ జెమిని పోశెట్టి గౌడ్, టియూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటి ఆద్యక్షుడిగా బబ్బూరి పోశెట్టి గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ముద్దసాని ఉపేందర్ గౌడ్, కోశాధికారిగా బబ్బూరి శ్రీరాములు, ప్రచార కార్యదర్శిగా కళ్లెం సంపత్, ఉపాధ్యాక్షులు రాసాల రాజు, నోముల నర్సింహ యాదవ్, సహాయ కార్యదర్శి ఏశబోయిన శ్రీశైలం, శెట్టి సుమన్, కమిటి సభ్యులుగా పబ్బాల కృష్ణ, కోట చంద్రశేఖర్, వట్టిపల్లి రమేష్, ఏశబోయిన యాకూబ్, కంచనపల్లి రమేష్, నోముల భానులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి చైర్మన్ రాసాల నర్సింహ, పెద్ద గౌడ్ బబ్బూరి యాదయ్య గౌడ్, కమిటి సభ్యులు కళ్లెం కృష్ణ, జక్కుల చంద్రయ్య, శెట్టి సుఫ్రీం, బబ్బూరి సాగర్, కోట సుధాకర్, బబ్బూరి సురేష్, సుక్కల సత్యనారాయణ, కోల బన్నీ, బబ్బూరి వేణు, బబ్బూరి దినేష్ తదితరులు పాల్గొన్నారు.