Home తెలంగాణ తెలంగాణ రైతులు పండించిన పంటలో బీజేపీ పాత్ర ఏంటి ?

తెలంగాణ రైతులు పండించిన పంటలో బీజేపీ పాత్ర ఏంటి ?

143
0

హైదరాబాద్
తెలంగాణ రైతులు పండించిన పంటలో బీజేపీ పాత్ర ఏంటి ని వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం అయన తెరాస శాసనసభా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రైతాంగం పంటలు , ధాన్యం పండిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పార్టీ తెలంగాణ రైతులకు నీళ్లిచ్చిందా ? కరంటు ఇచ్చిందా ? రైతుబంధు, రైతుభీమా పథకాలలో మీ భాగస్వామ్యం ఏంటి ? కొనుగోలు కేంద్రాల సందర్శన పేరుతో దాడులు చేస్తున్నారు .. ఏ అర్హతతో మీరు కొనుగోలు కేంద్రాలకు వెళ్తున్నారు. దేశంలో రైతులు రోడ్డెక్కించిన పుణ్యం బీజేపీ పాలనదే .. 70 ఏండ్ల పాలనలో నెలల తరబడి రైతులు వీధులలో ఆందోళన చేస్తున్నారు. క్వింటాలు వడ్లకు 67,68 కిలోల బియ్యం వస్తాయని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన లెక్కలే చెబుతున్నాయి .. క్వింటాలుకు 80 కిలోలు వస్తాయని బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది. శుద్ద అబద్దాలను ప్రచారం చేయడానికి కనీస ఇంగితజ్ఞానం బీజేపీకి లేదు .. కనీస అవగాహన లేని వారు బీజేపీలో నేతలుగా చలామణి అవుతున్నారు. మూర్ఖపు, అసత్యపు ప్రచారం చేస్తున్నారు. రైతుల రెక్కల కష్టంపై బీజేపీ దండయాత్ర. బీజేపీ అంటే బిజినెస్, కార్పోరేట్ పార్టీ. రైతుల పట్ల అభిమానం ఉంటే బీజేపీ నేతలు ఢిల్లీ యాత్ర చేసి నల్ల చట్టాలను రద్దు చేయమని కేంద్రాన్ని కోరాలి. రైతుల ఆందోళనలో చనిపోయిన రైతులకు పరిహారం రైతు కుటుంబాలకు అందించి క్షమాపణలు కోరాలి. బీజేపీ కొనుగోలు కేంద్రాల సందర్శన గర్భవతి దగ్గరకు వెళ్లి వెంటనే బిడ్డను కను .. కను అని అన్నట్లుంది .. కొనుగోలు కేంద్రాలలో ఎలాగు జరిగేది కొనుగోళ్లే . కొనుగోళ్లకు ఒక ప్రొసీజర్ ఉంటుంది .. తేమ శాతం, తాలు, మట్టిపెళ్లలు పరిశీలించాల్సి ఉంటుంది .. ఈ మాత్రం కనీస అవగాహన బీజేపీ పార్టీకి లేకపోవడం దౌర్భాగ్యమని అన్నారు.  తేమ, తాలు, మట్టి పెళ్లలతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం ఎఫ్ సీఐ ఆమోదిస్తుందా ? ధాన్యం కొనుగోళ్లలో కేవలం రెండు నెలలకే కేంద్రం వడ్డీ ఇస్తుంది .. కానీ కేంద్రం డబ్బులు ఇవ్వడానికే ఆరునెలలు పడుతుంది. దీనికి సంబంధించి మిగతా వడ్డీ , ఇతర నష్టాలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. యాసంగి వడ్లు కొనమని కేంద్రప్రభుత్వం చెప్పింది .. ఎప్పుడన్నాం బాయిల్డ్ వడ్లు కొనమని అన్నాం అని రాష్ట్ర బీజేపీ నేతలు అంటారు. యాసంగిలో పండేవే బాయిల్డ్ వడ్లు .. వాటిని కొనం అంటే యాసంగి వడ్లు కొనం అనే అర్దం. కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ వికృత చేష్టలను రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి అన్నారు.

Previous articleగంజాయి సాగు నిర్మూలనపై కళాజాత
Next articleనితిన్, ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి, శ్రేష్ట్ మూవీస్ ‘మాచర్ల నియోజకవర్గం’లో మరో హీరోయిన్ గా కేథరిన్ థ్రెసా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here