Home జాతీయ వార్తలు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయను : అఖిలేశ్ యాద‌వ్

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయను : అఖిలేశ్ యాద‌వ్

109
0

ల‌క్నోనవంబర్ 1
వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, స‌మాజ్‌వాదీ పార్టీ నేత‌ అఖిలేశ్ యాద‌వ్ చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పిన‌ట్లు స్ప‌ష్ట‌మైంది. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌మాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ మ‌ధ్య పొత్తు ఉంటుంద‌న్నారు. ఆర్ఎల్డీతో పొత్తు ఫైన‌ల్ అయ్యింద‌ని, కేవ‌లం సీట్ల పంప‌కంపై తుది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని ఆ ఇంట‌ర్వ్యూలో అఖిలేశ్ వెల్ల‌డించారు. ఆజమ్‌ఘ‌ర్ నుంచి ఎంపీగా ఉన్న అఖిలేశ్ యాద‌వ్ .. వ‌చ్చే ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. శివ‌పాల్ యాద‌వ్‌కు చెందిన ప్ర‌గ‌తిశీల స‌మాజ్‌వాదీ పార్టీకి కూడా అవ‌కాశం ఇవ్వనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

Previous articleవాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధరను రూ.266కు పెంపు
Next articleమాన‌వ‌త్వాన్నిచాటుకున్న సీఎం స్టాలిన్‌ కాన్వాయ్‌ను ఆపేసి.. అంబులెన్స్‌ కు దారి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here