న్యూఢిల్లీ నవంబర్ 22
పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని అత్యంత సాహసోపేతంగా కూల్చేసిన భారత వైమానిక దళం పైలట్, వింగ్ కమాండర్ (గ్రూప్ కెప్టెన్) అభినందన్ వర్ధమాన్కు ప్రతిష్టాత్మక ‘వీర్ చక్ర’ అవార్డును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రదానం
చేశారు. ఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అభినందన్ స్వీకరించారు. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అభినందన్ 2019,
ఫిబ్రవరి 27వ తేదీన ఎల్ఓసీ వద్ద పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16, ఎఫ్-17 యుద్ధ విమానాలను తన వద్ద ఉన్న రేడార్తో పసికట్టాడు. పొంచి ఉన్న ముప్పును గ్రహించి ఎంతో చాకచక్యంగా తన వద్ద ఉన్న మిస్సైల్తో ఎఫ్-16ను కూల్చేశాడు.
ఇదే క్రమంలో పీఓకే నుంచి తిరిగి వస్తుండగా మిగ్-21 ఢీకొట్టడంతో శత్రుదేశ అధీనంలోని ప్రాంతంలో విమానం నించి కిందపడ్డారు. వెంటనే పాకిస్థాన్ సైన్యం ఆయనను అదుపులోకి తీసుకుంది. దీనిపై భారత ప్రభుత్వంతో పాటు, అంతర్జాతీయ
సమాజం జోక్యంతో అభినందన్ను భారత్కు పాక్ తిరిగి అప్పగించక తప్పలేదు