Home తెలంగాణ యాసంగి వరి ధాన్యాన్ని మిల్లర్లు రోజువారి లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేపట్టాలి జిల్లా...

యాసంగి వరి ధాన్యాన్ని మిల్లర్లు రోజువారి లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేపట్టాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

127
0

కామారెడ్డి నవంబర్ 02

కామారెడ్డి జిల్లాలో యాసంగి వరి ధాన్యాన్ని మిల్లర్లు రోజువారి లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్  జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం రైస్ మిల్లర్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 30 లోగా మిల్లింగ్ పూర్తిచేయాలని సూచించారు. యాసంగి లో కొనుగోలు చేపట్టిన ధాన్యంలో 30 శాతం మిల్లింగ్ పూర్తయినట్లు చెప్పారు. సమావేశంలో     ఆర్డివో లు రాజా గౌడ్, శీను, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, ఇంచార్జ్ డిఎల్ఎస్వో రాజశేఖర్, జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ కె. పశుపతి రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.

Previous articleఏపీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్
Next articleభక్తిభావాన్ని పంచిన బాల‌కాండ అఖండ పారాయణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here