కర్నూలు
ఇటివలే నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి సోమవారం మధ్యాహ్నం వైయస్ఆర్ సిపి కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, కర్నూలు నగర మేయర్ బి.వై రామయ్య గారిని, వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు పరిధిలో వైయస్ఆర్ సిపి పార్టీ పరిస్థితులపై, వివిధ అంశాలపై చర్చించారు. భేటి అనంతరం వెంకటసుబ్బారెడ్డి ని శాలువాతో సత్కరించారు.